అనంత్ టెక్నాలజీస్ ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధనా మండలి) కోసం చేపట్టిన రెండు ఉపగ్రహ రూపకల్పన ప్రాజెక్టులను 2024, అక్టోబరు 18న లాంఛనంగా ఇస్రోకు అప్పగించింది. ఇవి 400 కిలోల తరగతికి చెందిన ఉపగ్రహాలు.
తొలిసారిగా ఈ ప్రాజెక్టును ఇస్రో ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించింది. అనంత్ టెక్నాలజీస్ తన బెంగళూరు ఏరోస్పేస్ పార్క్లో, ఈ ఉపగ్రహాల అసెంబ్లీ, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ (ఏఐటీ) కార్యకలాపాలను పూర్తి చేసింది.