Published on Feb 13, 2025
Current Affairs
ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌తో మోదీ భేటీ
ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌తో మోదీ భేటీ

ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌తో పారిస్‌లో 2025, ఫిబ్రవరి 12న భేటీ అయ్యారు.

ద్వైపాక్షిక అంశాలతోపాటు పలు అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు.

వాణిజ్యం, పెట్టుబడుల రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, ఫ్రాన్స్‌ తాజాగా తీర్మానించుకున్నాయి.

మార్సేలో మోదీ, మెక్రాన్‌ భారత నూతన కాన్సులేట్‌ను సంయుక్తంగా ప్రారంభించారు. 

2026ను భారత్‌-ఫ్రాన్స్‌ నవకల్పనల సంవత్సరంగా నిర్వహించుకోనున్న నేపథ్యంలో ప్రత్యేక లోగో విడుదల చేశాయి.