ప్రసవ సంబంధ మాతృమూర్తుల మరణాలు భారత్లో చాలా ఎక్కువగా ఉన్నాయని అమెరికాలోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (ఐహెచ్ఎంఈ) నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. 2023లో దేశంలో ప్రతి లక్ష శిశు జననాలకు 24,700 మంది తల్లులు చనిపోయారని తేలింది. ఇది దక్షిణాసియా, సబ్ సహారా ఆఫ్రికా ప్రాంతాల కంటే అధికం. ఈ వివరాలు ప్రముఖ వైద్య పత్రిక ‘ద లాన్సెట్’లో ప్రచురితమయ్యాయి.