Published on Nov 28, 2025
Current Affairs
ఇన్ఫినిటీ క్యాంపస్‌ ప్రారంభం
ఇన్ఫినిటీ క్యాంపస్‌ ప్రారంభం

అంతరిక్ష సేవల ప్రైవేటు సంస్థ స్కైరూట్‌ ఏరోస్పేస్‌ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఇన్ఫినిటీ క్యాంపస్‌ను 2025, నవంబరు 27న ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఉపగ్రహ ప్రయోగాల కోసం విక్రమ్‌-1 అనే ఆర్బిటల్‌ రాకెట్‌ను ఈ సంస్థ రూపొందించింది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ జెన్‌-జడ్‌ ఇంజినీర్లు, డిజైనర్లు, కోడర్లు, శాస్త్రవేత్తలు సరికొత్త అవకాశాలను సృష్టిస్తూ అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని విస్తరిస్తున్నారని అభినందించారు.