అంతరిక్ష సేవల ప్రైవేటు సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఇన్ఫినిటీ క్యాంపస్ను 2025, నవంబరు 27న ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు. ఉపగ్రహ ప్రయోగాల కోసం విక్రమ్-1 అనే ఆర్బిటల్ రాకెట్ను ఈ సంస్థ రూపొందించింది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ జెన్-జడ్ ఇంజినీర్లు, డిజైనర్లు, కోడర్లు, శాస్త్రవేత్తలు సరికొత్త అవకాశాలను సృష్టిస్తూ అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని విస్తరిస్తున్నారని అభినందించారు.