Published on Dec 27, 2024
Current Affairs
ఇన్‌కాయిస్‌
ఇన్‌కాయిస్‌

హిందూ మహాసముద్రంలో సునామీ బీభత్సాన్ని సృష్టించి డిసెంబరు 26 నాటికి 20 ఏళ్లు అయిన సందర్భంగా హైదరాబాద్‌ ప్రగతినగర్‌లోని భారత జాతీయ మహాసముద్ర పరిశోధనా కేంద్రం(ఇన్‌కాయిస్‌)లో సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా నవేరియాలో ఉండే షిప్‌లకు సునామీ సమాచారం అందించే వ్యవస్థను కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ ప్రారంభించారు. 

2004లో సునామీ సృష్టించిన అల్లకల్లోలంతో దేశంలో 10,749 మందితో సహా ప్రపంచవ్యాప్తంగా 2.30 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.