స్వచ్ఛభారత్ మిషన్-పట్టణ పథకం కింద ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో దేశంలోనే తొలి హరిత వ్యర్థాల ప్రాసింగ్ ప్లాంటును మధ్యప్రదేశ్లోని ఇందౌర్లో ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇది దేశంలోనే పరిశుభ్రమైన నగరంగా ఇప్పటికి ఎనిమిదిసార్లు సత్తా చాటింది. హరిత వ్యర్థాల(చెక్క, కొమ్మలు, ఆకులు, పూలు)ను విలువైన వనరులుగా మారుస్తూ అదనపు ఆదాయాన్ని అందిపుచ్చుకుంటుంది. శుభ్రమైన పరిసరాలతోపాటు చెత్త నుంచి సంపద సృష్టించడమే లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేశారు.
వ్యర్థాల నిర్వహణను పకడ్బందీగా చేపడుతూ.. 2024-25 సంవత్సరంలో ఇందౌర్ వరుసగా 8వ సారి ‘క్లీన్ సిటీ’గా నిలిచింది.