డాక్యుమెంట్లు, పార్శిళ్లను తక్కువ వ్యవధిలోనే గమ్యస్థానానికి చేర్చే కొత్త సేవలను తపాలా శాఖ ప్రారంభించింది. 2026, మార్చి 17న దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్లు సంయుక్తంగా దీనికి సంబంధించిన మూడు సేవలకు శ్రీకారం చుట్టారు.
వీటిలో మొదటిది... 24 గంటల్లో గమ్యం చేర్చే ‘స్పీడ్పోస్టు’(డాక్యుమెంట్స్). రెండోది...24 గంటల ‘స్పీడ్పోస్ట్ పార్శిల్’. మూడోది...‘48 గంటల స్పీడ్పోస్ట్’.