- దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో తమ కొత్త ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ)గా విలియం వాల్ష్ను నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఆయన ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) చీఫ్గా వ్యవహరిస్తున్నారు.
- 2025 డిసెంబరులో ఇండిగో కార్యకలాపాల్లో తీవ్ర అంతరాయాలు చోటుచేసుకున్న నేపథ్యంలో.. సంస్థ సీఈఓ బాధ్యతల నుంచి పీటర్ ఎల్బర్స్ వైదొలిగారు. ఆయన స్థానంలో ప్రస్తుత నియామకం జరిగింది.