కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మక పద్ధతిన ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ను 2024, అక్టోబరు 3న ఆవిష్కరించింది. అయిదేళ్లలో కోటి మంది యువతకు ముఖ్యంగా 21-24 ఏళ్ల వారికి ఇంటర్న్షిప్ అవకాశం కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం మొత్తం రూ.66,000 కోట్ల వార్షిక ఆర్థిక మద్దతును ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.800 కోట్ల వ్యయంతో ప్రయోగాత్మక ప్రాజెక్టు కింద డిసెంబరు 2 నుంచి ఇంటర్న్షిప్ మొదలుపెడతారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.25 లక్షల మంది అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారని ప్రభుత్వం తెలిపింది.