95 సభ్యదేశాలు కలిగిన ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయెన్స్ (ఐబీసీఏ) తొలి సమావేశం 2025, జూన్ 16న దిల్లీలో జరిగింది.
దీనికి కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ అధ్యక్షత వహించారు.
వన్యప్రాణి సంరక్షణలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందని భూపేందర్ యాదవ్ వెల్లడించారు.
పిల్లి జాతికి చెందిన పులులు, సింహాల వంటి వన్యమృగాల పరిరక్షణకు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయెన్స్ (ఐబీసీఏ) సభ్యదేశాలతో కలిసి పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో భూపేందర్ యాదవ్ ఐబీసీఏ అధ్యక్షునిగా ఎన్నిక కాగా ఎస్.పి.యాదవ్ డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు.