అంతర్జాతీయ ఉత్సవం ‘ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్)’ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2026, ఫిబ్రవరి 17న లాంఛనంగా ప్రారంభించారు. విశాఖ ఈఎన్సీ ఆఫీసర్స్ మెస్లో విందు (ప్రెసిడెన్షియల్ బాంక్వెట్) ఇవ్వడం ద్వారా ఇది మొదలైంది.
రష్యా, ఆస్ట్రేలియా, యూఏఈ.. తదితర దేశాల నుంచి వచ్చిన 19 విదేశీ నౌకలు, భారత నేవీకి చెందిన 45 నౌకలు, కోస్ట్గార్డ్, మర్చంట్ నేవీ, పరిశోధన నౌకలు 7 ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్నాయి.