Published on Nov 12, 2025
Current Affairs
ఇజ్రాయెల్‌
ఇజ్రాయెల్‌

మహారాజా దిగ్విజయ్‌సింగ్‌జీ రంజిత్‌సింహ్‌జీ విగ్రహాన్ని నెవాటిమ్‌ (ఇజ్రాయెల్‌)లోని యూదు రైతుల సహకార సంఘమైన ‘‘మోషవ్‌’’లో ఆవిష్కరించారు. మహారాజా రంజిత్‌సింహ్‌జీ గుజరాత్‌లో ప్రస్తుతం జామ్‌నగర్‌గా ప్రసిద్ధమైన నవనగర్‌ సంస్థానాధీశుడు. ప్రపంచ యుద్ధకాలంలో అత్యంత దయాగుణం కనబరిచిన ఆ సంస్థానాధీశుని విగ్రహం స్థాపించడం ద్వారా ఇండియన్‌ జ్యూయిష్‌ హెరిటేజ్‌ సెంటర్, కొచిని జ్యూయిష్‌ హెరిటేజ్‌ సెంటర్‌లు ఆయనను మరణానంతరం సత్కరించాయి.