Published on Sep 19, 2024
Government Jobs
ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌ 2025
ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌ 2025

న్యూదిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ‘ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌-2025’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా యూపీఎస్సీ దేశవ్యాప్తంగా రైల్వే, టెలికాం, డిఫెన్స్‌ సర్వీస్‌ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో ఇంజినీరింగ్‌ ఉద్యోగాలు భర్తీ చేయనుంది.

మొత్తం పోస్టులు: 232.

వివరాలు:

యూపీఎస్సీ- ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌-2025

విభాగాలు: సివిల్‌, మెకానికల్‌‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌.

విద్యార్హతలు: పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి డిప్లొమా, బీఈ/ బీటెక్ చ‌దివి ఉండాలి. లేదా ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్(ఇండియా) ఇన్‌స్టిట్యూట్ ఎగ్జామినేషన్స్ ఎ, బి విభాగాలు ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అసోసియేట్ మెంబర్‌షిప్ ఎగ్జామినేషన్ పార్ట్స్ 2, 3/ సెక్షన్లు ఎ, బి అర్హత సాధించాలి. లేదా ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజినీర్స్ ఇన్‌స్టిట్యూషన్(ఇండియా) గ్రాడ్యుయేట్ సభ్యత్వ పరీక్ష పాసై ఉండాలి. లేదా ఎంఎస్సీ(వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ ఎలక్ట్రానిక్స్‌, రేడియో ఫిజిక్స్‌, రేడియో ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: అభ్యర్థులు వయసు 01-01-2025 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాలి. అభ్యర్థులు ముందుగా పార్ట్-1, పార్ట్-2 అప్లికేషన్ పూర్తి చేయాలి. 

ఎంపిక విధానం: స్టేజ్‌-1 (ప్రిలిమినరీ/ స్టేజ్‌-1) ఎగ్జామ్‌, స్టేజ్‌-2 (మెయిన్‌/ స్టేజ్‌-2) ఎగ్జామ్‌, స్టేజ్‌-3 (పర్సనాలిటీ టెస్ట్‌), మెడికల్‌ ఎగ్జామినేషన్‌, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ప్రిలిమినరీ/ స్టేజ్-I: పరీక్షలో రెండు ఆబ్జెక్టివ్ టైప్ (మల్టిపుల్‌ చాయిస్‌) ప్రశ్న పత్రాలు ఉంటాయి. మొత్తం 500 మార్కులు (పేపర్ I- 200 మార్కులు; పేపర్ II- 300 మార్కులు) ఉంటాయి.

మెయిన్/ స్టేజ్-II: ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి రెండు పేపర్లు ఉంటాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలు. మొత్తం 600 మార్కులు (ప్రతి పేపర్‌లో 300 మార్కులు) కేటాయించారు.

దరఖాస్తు ఫీజు: మహిళా/ ఎస్సీ /ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు. ఇతరులు రూ.200 చెల్లించాలి.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని మెయిన్ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08.10.2024.

ప్రిలిమినరీ/ స్టేజ్-1 పరీక్ష తేదీ: 09-02-2025.

Website:https://upsc.gov.in/

Apply online:https://upsconline.nic.in/upsc/OTRP/