న్యూ దిల్లీలోని ఇంజినీరింగ్ ప్రాజెక్ట్ ఇండియా లిమిటెడ్ (ఈపీఐఎల్) ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన మేనేజిరియల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 68
వివరాలు:
1. అసిస్టెంట్ మేనేజర్- 22
2. మేనేజర్ (గ్రేడ్-2)- 10
3. మేనేజర్ (గ్రేడ్-1)- 18
4. సీనియర్ మేనేజర్- 18
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, లీగల్, ఐటీ, ఐసీటీ సపోర్ట్.
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్/ ఏఎంఐఈ లేదా తత్సమానం. సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ ఎంబీఏ, ఎల్ఎల్బీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు అసిస్టెంట్ మేనేజర్కు రూ.40,000; మేనేజర్ గ్రేడ్-2కు రూ.50,000 మేనేజర్ గ్రేడ్-1కు రూ.60,000; సీనియర్ మేనేజర్కు రూ.70,000.
వయోపరిమితి: అసిస్టెంట్ మేనేజర్కు 32 ఏళ్లు; మేనేజర్ గ్రేడ్-2కు 35 ఏళ్లు; మేనేజర్ గ్రేడ్-1కు 37 ఏళ్లు; సీనియర్ మేనేజర్కు 42 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ వేదిక: కార్పొరేట్ ఆఫీస్ న్యూదిల్లీ, రిజినల్ ఆఫీసెస్.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 06.05.2025.
Website: https://epi.gov.in/