Published on Mar 29, 2025
Current Affairs
ఆసియా రెజ్లింగ్‌
ఆసియా రెజ్లింగ్‌

ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో మహిళల ఫ్రీస్టైల్‌ 62 కిలోల విభాగంలో భారత్‌కి చెందిన మనీషా బన్వాలా స్వర్ణం నెగ్గింది.

2025, మార్చి 28న అమ్మాన్‌ (జోర్డాన్‌)లో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో మనీషా 8-7తో ఒక్‌ కిమ్‌ (ఉత్తర కొరియా)ను ఓడించింది.

ప్రస్తుత టోర్నీలో భారత్‌కు దక్కిన తొలి పసిడి ఇదే. 

మరోవైపు అంతిమ్‌ ఫంగాల్‌ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. 53 కిలోల విభాగం కంచు పోరులో ఆమె 10-0తో మింగ్‌ సువాన్‌ (చైనీస్‌ తైపీ)ని చిత్తు చేసింది.