Published on Oct 25, 2025
Current Affairs
ఆసియా యూత్‌ క్రీడలు
ఆసియా యూత్‌ క్రీడలు

ఆసియా యూత్‌ క్రీడల్లో భారత్‌ 2025, అక్టోబరు 24న నాలుగు పతకాలు సాధించింది. రిఫా (బహ్రెయిన్‌)లో జరిగిన బాలికల 400 మీటర్లలో ఎడ్వినా జేసన్‌ (55.43 సె) రజతం సాధించింది. డిస్కస్‌ త్రోలో ఒషిన్‌ రజతం గెలుచుకుంది. ఆమె 43.38 మీటర్లలో త్రోతో రెండో స్థానంలో నిలిచింది. బాలుర 5 వేల మీటర్ల నడకలో పలాష్‌ మండల్‌ కాంస్యం గెలిచాడు. అతడు 24 నిమిషాల 48.92 సెకన్లలో లక్ష్యాన్ని చేరి మూడో స్థానంలో నిలిచాడు. బాలుర హైజంప్‌లో జుబిన్‌ కాంస్యం సాధించాడు. అతడు 2.03 మీటర్ల జంప్‌తో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు.