ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు కాంస్యం నెగ్గింది. 2024, అక్టోబరు 10న కజకిస్థాన్లోని ఆస్తానాలో జరిగిన పోటీలో భారత్ 0-3తో చైనీస్ తైపీ చేతిలో ఓడింది. తొలి మ్యాచ్లో శరత్కమల్ 7-11, 10-12, 9-11తో లిన్ యూ జూ చేతిలో ఓడగా, తర్వాతి మ్యాచ్లో మానవ్ థక్కర్ 9-11, 11-8, 3-11, 11-13తో చెంగ్ చేతిలో ఓడాడు. ఆఖరి మ్యాచ్లో హర్మీత్ దేశాయ్ 6-11, 9-11, 7-11తో హువాంగ్ యన్ చేతిలో ఓడి.. భారత్ పరాజయం పొందింది.