Published on Oct 11, 2024
Current Affairs
ఆసియా టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌
ఆసియా టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌

ఆసియా టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు కాంస్యం నెగ్గింది. 2024, అక్టోబరు 10న కజకిస్థాన్‌లోని ఆస్తానాలో జరిగిన పోటీలో భారత్‌ 0-3తో చైనీస్‌ తైపీ చేతిలో ఓడింది. తొలి మ్యాచ్‌లో శరత్‌కమల్‌ 7-11, 10-12, 9-11తో లిన్‌ యూ జూ చేతిలో ఓడగా, తర్వాతి మ్యాచ్‌లో మానవ్‌ థక్కర్‌ 9-11, 11-8, 3-11, 11-13తో చెంగ్‌ చేతిలో ఓడాడు. ఆఖరి మ్యాచ్‌లో హర్మీత్‌ దేశాయ్‌ 6-11, 9-11, 7-11తో హువాంగ్‌ యన్‌ చేతిలో ఓడి.. భారత్‌ పరాజయం పొందింది.