Published on Oct 16, 2024
Current Affairs
ఆసియా టేబుల్‌ టెన్నిస్‌
ఆసియా టేబుల్‌ టెన్నిస్‌

ఆసియా టేబుల్‌ టెన్నిస్‌లో మహిళల డబుల్స్‌లో ఐహిక ముఖర్జీ, సుతీర్థ ముఖర్జీ జంట కంచు పతకం సొంతం చేసుకుంది. 2024, అక్టోబరు 13న ఆస్తానా (కజకిస్థాన్‌)లో జరిగిన సెమీఫైనల్లో ఐహిక-సుతీర్థ ద్వయం 4-11, 9-11, 8-11తో మివా హరిమోటో-మియూ కిహారా (జపాన్‌) జోడీ చేతిలో ఓడింది. ఆసియా టేబుల్‌ టెన్నిస్‌ చరిత్రలో మహిళల డబుల్స్‌లో భారత్‌కు దక్కిన తొలి పతకమిదే. 

1972లో ఈ టోర్నీ మొదలయ్యాక మహిళల డబుల్స్, టీమ్‌ విభాగాల్లో పతకాలు నెగ్గడం ఇదే తొలిసారి.