ఆసియా టేబుల్ టెన్నిస్లో మహిళల డబుల్స్లో ఐహిక ముఖర్జీ, సుతీర్థ ముఖర్జీ జంట కంచు పతకం సొంతం చేసుకుంది. 2024, అక్టోబరు 13న ఆస్తానా (కజకిస్థాన్)లో జరిగిన సెమీఫైనల్లో ఐహిక-సుతీర్థ ద్వయం 4-11, 9-11, 8-11తో మివా హరిమోటో-మియూ కిహారా (జపాన్) జోడీ చేతిలో ఓడింది. ఆసియా టేబుల్ టెన్నిస్ చరిత్రలో మహిళల డబుల్స్లో భారత్కు దక్కిన తొలి పతకమిదే.
1972లో ఈ టోర్నీ మొదలయ్యాక మహిళల డబుల్స్, టీమ్ విభాగాల్లో పతకాలు నెగ్గడం ఇదే తొలిసారి.