Published on Nov 22, 2024
Current Affairs
ఆసియాన్‌ ప్లస్‌ రక్షణ మంత్రుల సదస్సు
ఆసియాన్‌ ప్లస్‌ రక్షణ మంత్రుల సదస్సు

లావోస్‌ రాజధాని వియంటియన్‌లో 2024, నవంబరు 21న జరిగిన ‘ఆగ్నేయాసియా దేశాల సంఘం (ఆసియాన్‌) రక్షణ మంత్రుల సమావేశం-ప్లస్‌ (ఏడీఎంఎం-ప్లస్‌)’ సదస్సులో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పాల్గొని, ప్రసంగించారు.

సరిహద్దు వివాదాలు, వాణిజ్య ఒప్పందాలు సహా పలు సంక్లిష్ట అంతర్జాతీయ అంశాల విషయంలో భారత్‌ ఎల్లప్పుడూ చర్చల మార్గాన్నే అనుసరిస్తూ వస్తోందని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. 

ఏడీఎంఎం-ప్లస్‌ సదస్సులో ఆసియాన్‌ సభ్యదేశాలతోపాటు భారత్, అమెరికా, చైనా, జపాన్, దక్షిణ కొరియా, రష్యా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల ప్రతినిధులు పాల్గొన్నారు.