భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని నవరత్న సంస్థ అయిన రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఆర్సీఎఫ్ఎల్) మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
వివరాలు:
మేనేజ్మెంట్ ట్రైనీ: 08 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.08.2025 27 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు ట్రైనీ శిక్షణ కాలంలో రూ.60,000. తరువాత రూ.40,000- రూ.1,40,000.
దరఖాస్తు ఫీజు: ఓబీసీ అభ్యర్థులకు రూ.1000; ఎస్సీ/ ఎస్టీ, ఎక్స్సర్విస్మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 06.12.2025.
దరఖాస్తు చివరి తేదీ: 20.12.2025.