Published on Dec 10, 2024
Current Affairs
ఆర్‌బీఐ గవర్నర్‌గా సంజయ్‌ మల్హోత్రా
ఆర్‌బీఐ గవర్నర్‌గా సంజయ్‌ మల్హోత్రా

రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) 26వ గవర్నర్‌గా సంజయ్‌ మల్హోత్రా (56)ను కేంద్ర ప్రభుత్వం 2024, డిసెంబరు 9న నియమించింది.

మంత్రివర్గ నియామకాల సంఘం ఆయన నియామకానికి ఆమోదం తెలిపింది. మూడేళ్ల పాటు సంజయ్‌ ఈ పదవిలో కొనసాగుతారు. 

సంజయ్‌ మల్హోత్రా 1990 బ్యాచ్‌కు చెందిన రాజస్థాన్‌ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారి. ప్రస్తుతం ఆర్థిక శాఖలో కార్యదర్శి (రెవెన్యూ)గా పనిచేస్తున్నారు.