వైస్ అడ్మిరల్ ఆరతీ సరీన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్కి తొలి మహిళా డైరెక్టర్ జనరల్ (డీజీఏఎఫ్ఎంఎస్)గా ఎంపికయ్యారు. 45 మంది మగవాళ్ల తర్వాత ఆమె ఈ స్థానాన్ని అధిరోహించారు. డీజీగా ఆమె త్రివిధ దళాల మెడికల్ సర్వీసెస్కీ నాయకత్వం వహిస్తారు. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో సాయుధ దళాలకు సంబంధించిన మెడికల్ పాలసీలను పర్యవేక్షిస్తారు.