Published on Oct 21, 2025
Current Affairs
ఆర్చరీ ప్రపంచకప్‌
ఆర్చరీ ప్రపంచకప్‌

ఆర్చరీ ప్రపంచకప్‌ ఫైనల్‌ టోర్నీలో విజయవాడ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ కాంస్యం నెగ్గింది.

2025, అక్టోబరు 18న నాన్‌జింగ్‌ (చైనా)లో జరిగిన కాంపౌండ్‌ మహిళల సింగిల్స్‌ కాంస్య పోరులో సురేఖ 150-145తో ఎలా గిబ్సన్‌ (బ్రిటన్‌)ను ఓడించింది.

ఈ పోరులో ఆమె వరుసగా 15 సార్లు ఫర్‌ఫెక్ట్‌ టెన్‌ స్కోరు చేసింది. 

ఆర్చరీ ప్రపంచకప్‌ ఫైనల్‌ టోర్నీలో మహిళల వ్యక్తిగత కాంపౌండ్‌లో భారత్‌కు ఇదే  తొలి పతకం.