సికింద్రాబాద్, ఆర్కే పురంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ (ఏపీఎస్) ఒప్పంద/ తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 04
వివరాలు:
1. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: 01
2. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ-ఇంగ్లిష్): 01
3. ప్రీ ప్రైమరీ టీచర్: 02
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, బీఈడీ, పీజీ/ ఎంబీఏ ఉత్తీర్ణతతో పని అనుభవం కలిగి ఉండాలి.
వయో పరిమితి: అనుభవజ్ఞులైన అభ్యర్థులు 57 ఏళ్లలోపు ఉండాలి.
జీతం: నెలకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకు రూ.42,400; టీజీటీ పోస్టులకు రూ.38,000; ప్రీ ప్రైమరీ టీచర్ పోస్టులకు రూ.20,000.
దరఖాస్తు ఫీజు: రూ.250.
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్, కంప్యూటర్ ప్రావీణ్యం, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను ‘ ది ప్రిన్సిపల్, ఆర్మీ పబ్లిక్ స్కూల్, ఆర్కే పురం, సికింద్రాబాద్’ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 28-09-2024.
Website:https://apsrkpuram.edu.in/