Published on Nov 29, 2025
Current Affairs
ఆపరేషన్‌ సాగర్‌ బంధు
ఆపరేషన్‌ సాగర్‌ బంధు

దిత్వా తుపాను కారణంగా అతలాకుతలమైన శ్రీలంకకు మానవతా సాయం అందించేందుకు భారత ప్రభుత్వం ‘ఆపరేషన్‌ సాగర్‌ బంధు’ను ప్రారంభించింది. కష్టసమయంలో పొరుగుదేశానికి చేయూత అందించేందుకు భారత్‌ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

తుపాను కారణంగా ఆకస్మిక వరదలు ముంచెత్తడంతోపాటు కొండచరియలు విరిగిపడడంతో మరణించినవారి సంఖ్య 80కి చేరినట్లు శ్రీలంక ప్రభుత్వ విపత్తు నిర్వహణ కేంద్రం వెల్లడించింది.