చిన్నారులపై లైంగిక దాడుల నివారణకు మహిళ, శిశు భద్రత విభాగం ఆధ్వర్యంలో ‘ఆపరేషన్ చిన్నారి-తల్లి’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్కుమార్ గుప్తా తెలిపారు. ‘సురక్షిత బాల్యం- సుస్థిర భవిష్యత్తు’ అనే ట్యాగ్లైన్తో దీన్ని రూపొందించారు. చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే నిందితులకు కఠిన శిక్షలు పడేలా ‘స్పీడ్ ట్రయల్ మోనిటరింగ్’ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.