విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయంలో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి రెండేళ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు:
డిప్లొమా ఇన్ ఫిషరీస్ ప్రోగ్రామ్- 2025-26.
వ్యవధి: రెండేళ్లు.
భోదనా మాధ్యమం: ఇంగ్లిష్.
మొత్తం సీట్లు: ప్రభుత్వ కళాశాలల్లో 55, అనుబంధ కళాశాలల్లో 330 సీట్లు.
అర్హత: పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా.
వయోపరిమితి: గరిష్ఠ వయసు 22 ఏళ్లు. 31-08-2025 నాటికి 15 నిండి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: జనరల్ రూ.800; ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్ అభ్యర్థులకు రూ.400.
దరఖాస్తు చివరి తేదీ: 20-06-2025.
Website: https://apfu.ap.gov.in/