ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా అహోబిలానికి జాతీయ ఉత్తమ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం అవార్డు దక్కింది. కేంద్ర పర్యాటకశాఖ 2024 సంవత్సరానికి ఎనిమిది కేటగిరీల్లో నిర్వహించిన పోటీల్లో ఆధ్యాత్మిక విభాగంలో అహోబిలానికి ఈ అవార్డు దక్కింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా 2024, సెప్టెంబరు 27న దిల్లీలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అవార్డును రాష్ట్ర అధికారులకు అందజేశారు.