Published on Jul 27, 2024
Current Affairs
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా

అస్సాంలో అహోమ్‌ రాజవంశీకులు నిర్మించిన సమాధులను 2024, జులై 26న యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. ఈశాన్య భారతం నుంచి ఈ జాబితాలో చేరిన మొట్టమొదటి వారసత్వ సంపద ఇదే. భారత్‌లో జరుగుతున్న యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సమావేశాలలో ఈ నిర్ణయం తీసుకున్నారు.