దృశ్య పరిధి అవతలున్న (బియాండ్ విజువల్ రేంజ్) లక్ష్యాలను ఛేదించే ‘అస్త్ర’ క్షిపణిని భారత్ 2025, జులై 11న విజయవంతంగా పరీక్షించింది.
ఒడిశా తీరానికి చేరువలో ఇది జరిగింది. గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగల ఈ అస్త్రాన్ని సుఖోయ్-ఎంకేఐ యుద్ధవిమానం నుంచి ప్రయోగించారు.
ఇది వంద కిలోమీటర్లకు మించిన పరిధి కలిగి ఉంది. ఇందులో అధునాతన గైడెన్స్, నేవిగేషన్ వ్యవస్థలు ఉన్నాయి.
తాజా పరీక్షను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), భారత వాయుసేన నిర్వహించాయి.