Published on Oct 15, 2025
Current Affairs
అరుణాచల్‌ ప్రదేశ్‌
అరుణాచల్‌ ప్రదేశ్‌

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పశ్చిమ కమెంగ్‌ జిల్లా శేర్‌గావ్‌ అడవుల్లో బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (బీఎస్‌ఐ) బృందం ‘ఇంపేషన్స్‌ రాజీబియానా’ పేరుతో గురివింద (బాల్సమ్‌) జాతి పూలలో కొత్తరకాన్ని కనుక్కుంది.

2025, అక్టోబరు 14న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ వెల్లడించారు.

డాక్టర్‌ కృష్ణా చౌలూ సారథ్యంలోని శాస్త్రవేత్తల బృందం దీన్ని గుర్తించింది. 

బీఎస్‌ఐ గతంలోనూ పలు గులివింద జాతి పూలను దేశంలో గుర్తించింది.