‘జాతీయ పర్వతారోహణ, సాహస క్రీడల సంస్థ’ (నిమాస్) అరుణాచల్ప్రదేశ్లోని ఓ పర్వతానికి ఆరో దలైలామా - సాంగ్యాంగ్ గ్యాత్సో పేరుపెట్టింది. అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో నిమాస్ 15 రోజుల సాహసయాత్ర చేపట్టి, ఈ పర్వతంపైకి చేరుకుని, దాని ఎత్తును 20,942 అడుగులుగా తేల్చింది. మాన్ తవాంగ్ ప్రాంతంలో 1682లో సాంగ్యాంగ్ గ్యాత్సో జన్మించారు.
అరుణాచల్లోని దిరాంగ్లో నెలకొన్న నిమాస్ సంస్థ- భారత రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. దలైలామా అపార విజ్ఞానానికి, మోన్పా తెగకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా పర్వతానికి పేరు పెట్టినట్లు రక్షణశాఖ తెలిపింది.