అరుణాచల్ప్రదేశ్లో రెండు కొత్తరకం కప్పలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీటిని జీనస్ లెప్టోబ్రాచియం జాతికి చెందిన సోమని, మెచుకాగా గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ జాతి కప్పలు 39 ఉండగా, వాటిలో నాలుగు భారత్లోనే ఉన్నాయి.
దిల్లీ విశ్వవిద్యాలయం, పర్యావరణ విద్య విభాగం, హార్వర్డ్ యూనివర్సిటీలోని మ్యూజియం ఆఫ్ కంపారిటివ్ జువాలజీలకు చెందిన పరిశోధకులు వీటిని కనుగొన్నారు.