భారత గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేశి చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత 2800 లైవ్ రేటింగ్ పాయింట్లకు చేరుకున్న రెండో భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు.
యూరోపియన్ క్లబ్ చెస్ టోర్నీలో 2024, అక్టోబరు 24న అయిదో రౌండ్లో ఆంద్రీకిన్ ద్మిత్రిపై గెలుపుతో అర్జున్ ఈ మైలురాయిని అందుకున్నాడు.
లైవ్ రేటింగ్స్లో అతడు ప్రస్తుతం 2802.1 పాయింట్లతో ఉన్నాడు. చెస్ చరిత్రలో అర్జున్ కంటే ముందు 15 మంది మాత్రమే 2800 రేటింగ్ పాయింట్లు సాధించారు.
అతడు ఈ టోర్నీలో అల్కలాయిడ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
2011 మార్చిలో విశ్వనాథన్ ఆనంద్ అత్యధికంగా 2817 రేటింగ్ను అందుకున్నాడు.