దేశవ్యాప్తంగా కార్మికులందరికీ సామాజిక భద్రత, న్యాయం అందించేందుకు నాలుగు కార్మిక(లేబర్) కోడ్లను అమల్లోకి తీసుకువచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కార్మికులందరికీ కనీస వేతనాలు అమలు చేయడంతో పాటు సకాలంలో వేతనాలు చెల్లిస్తూ ఆర్థిక భద్రత కల్పించనున్నట్లు పేర్కొంది.
దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో రూపొందించిన.. వేతనాల కోడ్-2019, పారిశ్రామిక సంబంధాల కోడ్-2020, సామాజిక భద్రత కోడ్-2020, వృత్తిపరమైన భద్రత-ఆరోగ్యం-పనిప్రదేశాల్లో పరిస్థితుల కోడ్-2020.. ఈ 4 కార్మిక కోడ్లను దేశవ్యాప్తంగా ఒకేసారి 2025, నవంబరు 21 నుంచి అమల్లోకి తీసుకువచ్చింది.