Published on Feb 13, 2025
Current Affairs
అమెరికా, రష్యా యుద్ధ విమానాల ప్రదర్శన
అమెరికా, రష్యా యుద్ధ విమానాల ప్రదర్శన

బెంగళూరులో నిర్వహిస్తున్న 15వ వైమానిక ప్రదర్శన (ఏరో ఇండియా)లో 2025, ఫిబ్రవరి 12న తొలిసారిగా ఒకే వేదికపై రష్యా, అమెరికా యుద్ధ విమానాలను ప్రదర్శించారు.

స్వీడన్, బ్రెజిల్, జర్మనీ, ఫ్రాన్స్‌ లాంటి 27కు పైగా దేశాలు తమ యుద్ధ విమానాలను ప్రదర్శించేందుకు వచ్చాయి. 

ఏరో ఇండియా ప్రారంభమైన 1996 నుంచే రష్యా పాల్గొంటోంది. తొలిసారిగా భారత గగనతలంలో విహరించిన ఎస్‌యూ-57ఈ 5వ తరం యుద్ధ విమానాల్లో శ్రేష్ఠమైనది.

ఇందులో వినియోగించిన ఆధునిక సాంకేతికతను భారత్‌కు అందించేందుకు రష్యా ఒప్పందం చేసుకుంది.

మరోవైపు ఏరో ఇండియా వేదికపై భారత్, అమెరికా దేశాల రక్షణ శాఖలు కీలకమైన ఒప్పందాలు చేసుకున్నాయి.

వైమానిక, జలాంతర్గామి, డ్రోన్, సైబర్‌ భద్రతలపై 4 బిలియన్‌ డాలర్ల విలువైన ఒప్పందాలు చేసుకుంది.