నోబెల్ అవార్డు గ్రహీత హాన్ కాంగ్ రాసిన నవల ‘వి డు నాట్ పార్ట్’, కృత్రిమ మేథ, ఓపెన్ ఏఐపై కరెన్ హవో చేసిన పరిశీలన, రచయిత్రి అరుంధతి రాయ్ రచించిన ఆత్మకథ పుస్తకాలు.. అమెరికా వార్షిక ‘నేషనల్ బుక్ క్రిటిక్స్ సర్కిల్’ అవార్డు జాబితాలో విజేతలుగా నిలిచాయి. హాన్ కాంగ్ రచించిన ‘వి డు నాట్ పార్ట్’ అనే పుస్తకం కొరియా ప్రధాన భూభాగానికి దక్షిణాన ఉన్న జెజు ద్వీపంలో 1948-49లలో జరిగిన తిరుగుబాటును వివరిస్తుంది. దీనిలో వేలాది మంది చనిపోయారు