అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో అంతరిక్ష నౌకలు, అంతరిక్ష ఆప్టిక్ సాధనాల తయారీకి ఒక యూనిట్ను నెలకొల్పబోతున్నట్లు బెంగుళూరుకు చెందిన అంకుర సంస్థ ‘దిగంతర’ 2025, ఫిబ్రవరి 11న ప్రకటించింది.
కీలక, సరికొత్త సాంకేతికతలలో వ్యూహపరమైన భాగస్వామ్యం నెరపాలని భారత్-అమెరికాలు గతంలోనే నిశ్చయించాయి.
దాని ఫలితమే కొలరాడోలో ఏర్పడనున్న దిగంతర యూనిట్. దీనిపై 10 లక్షల డాలర్ల పెట్టుబడి పెడుతోంది.
కొలరాడో ప్రభుత్వం కూడా 10 లక్షల డాలర్ల విలువైన ప్రోత్సాహకాలను అందిస్తుంది.