Published on Jun 17, 2025
Current Affairs
అమితాబ్‌ కాంత్‌
అమితాబ్‌ కాంత్‌

అమితాబ్‌ కాంత్‌ 2025, జూన్‌ 16న జీ20 షెర్పా బాధ్యతల నుంచి వైదొలిగారు.

1980 బ్యాచ్, కేరళ క్యాడర్‌కు చెందిన ఈ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి 2022 జులైలో భారత జీ20 షెర్పాగా నియమితులయ్యారు.

అప్పట్లో జీ20 సమావేశాలకు భారత్‌ అధ్యక్షత వహించడానికి కొద్ది నెలల ముందు ఈ నియామకం జరిగింది.  

2016-22 వరకు నీతిఆయోగ్‌ సీఈఓగా కాంత్‌ బాధ్యతలు నిర్వహించారు.

పారిశ్రామిక విధానాలు, ప్రోత్సాహక విభాగానికి సెక్రటరీగా పనిచేస్తున్నప్పుడు.. సంస్కరణలు, సరళీకరణలకు కాంత్‌ పెద్దపీట వేశారు.

పర్యాటక మంత్రిత్వ శాఖకు సంయుక్త కార్యదర్శిగా కాంత్‌ ఉన్న సమయంలోనే ‘ఇంక్రెడిబుల్‌ ఇండియా’ను తీసుకొచ్చారు.