Published on Mar 13, 2025
Current Affairs
అబిద్‌ అలీ కన్నుమూత
అబిద్‌ అలీ కన్నుమూత

భారత క్రికెట్‌ జట్టుకు 29 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్‌ దిగ్గజ క్రికెటర్‌ సయ్యద్‌ అబిద్‌ అలీ 2025, మార్చి 12న మరణించారు.

ఆయన వయసు 83 ఏళ్లు. అబిద్‌ 1967-74 మధ్య భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.

పేస్‌ బౌలర్, లోయర్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ అయిన అబిద్‌.. మేటి ఫీల్డర్‌గానూ పేరు తెచ్చుకున్నారు. 29 టెస్టుల్లో 49 వికెట్లు పడగొట్టి, 1018 పరుగులు సాధించారు.