Published on Jul 23, 2025
Current Affairs
అపాచీ పోరాట హెలికాప్టర్లు
అపాచీ పోరాట హెలికాప్టర్లు

భారత సైనిక పోరాట సామర్థ్యాన్ని మరింత పెంచే విధంగా మూడు అపాచీ పోరాట హెలికాప్టర్లు 2025, జులై 22న మన దేశానికి చేరాయి.

మొత్తం ఆరు అపాచీ ఏహెచ్‌-64ఈల కొనుగోలుకు భారత్‌.. అమెరికాకు చెందిన బోయింగ్‌ సంస్థతో రూ.4,168 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

మిగిలిన మూడు ఈ ఏడాది చివరిలోగా అందుతాయి. 

ఆధునిక క్షిపణులు, రాకెట్లతో కూడిన ఈ లోహవిహంగం.. ప్రతికూల ప్రాంతాల్లో భారత సైన్యంలోని విమానయాన విభాగం సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది.

భారత వాయుసేన వద్ద ఇప్పటికే 22 అపాచీ హెలికాప్టర్లు ఉన్నాయి.