మండలి వెంకటకృష్ణారావు అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పి.త్రివిక్రమరావు(విక్రమ్)ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025, డిసెంబరు 5న ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్లు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని పేర్కొంది. అధికార భాషా సంఘం చేపట్టాల్సిన కార్యాచరణను ఉత్తర్వుల్లో వివరించింది.