Published on Jan 28, 2025
Current Affairs
అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా ధనంజయ
అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా ధనంజయ

కేంద్ర ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో వాదనలు వినిపించేందుకు అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా సీనియర్‌ న్యాయవాది చల్లా ధనంజయ 2025, జనవరి 27న నియమితులయ్యారు. ఈయన మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. 

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ధనంజయ జన్మించారు. 1983లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు.

1983-87 వరకు రాజమహేంద్రవరంలో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 2022లో హైకోర్టు ఆయనకు సీనియర్‌ న్యాయవాది హోదాను ఇచ్చింది.