సుప్రీంకోర్టులో భారత ప్రభుత్వ అదనపు సొలిసిటర్ జనరల్గా తెదేపా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ 2025, డిసెంబరు 23న నియమితులయ్యారు. ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మూడేళ్లపాటు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకూ ఈ పదవిలో కొనసాగుతారు. రవీంద్రకుమార్ 1983లో ఆంధ్రప్రదేశ్ బార్కౌన్సిల్లో నమోదై న్యాయవాద వృత్తి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం, ఏపీఎస్ఆర్టీసీ, ఏపీ విద్యుత్తు బోర్డు, ఏపీ ట్రాన్స్కో, ఏపీ డిస్కంల స్టాండింగ్ కౌన్సెల్గా పనిచేశారు.
2018 నుంచి 2024 వరకు తెదేపా తరఫున రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.