వచ్చే మహిళల టీ20 ప్రపంచకప్ కోసం ఐసీసీ అంపైర్ల ప్యానెల్ను ప్రకటించింది. టోర్నీ పర్యవేక్షణ కోసం 10 మంది అంపైర్లు, ముగ్గురు రిఫరీలను నియమించారు. అందరూ మహిళలే.
అంపైర్లు: లారెన్ ఏజ్బ్యాగ్, కిమ్ కాటన్, దంబనెవన, అనా హారిస్, నిమాలి పెరీరా, క్లెయిర్ పొలోసాక్, వృంద రాఠీ, రెడ్ఫెర్న్, షెరిడాన్, జాక్వెలియన్ విలియమ్స్; మ్యాచ్ రిఫరీలు: షాండ్రీ ఫ్రిట్జ్, జీఎస్ లక్ష్మి, మిషెల్ పెరీరా.