ప్రపంచంలో అత్యధిక పేదలు ఉన్న అయిదు దేశాలలో భారత్ ఒకటని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి సంస్థ (యు.ఎన్.డి.పి), ఆక్స్ఫర్డ్ పేదరిక-మానవాభివృద్ధి అధ్యయన సంస్థ సంయుక్తంగా విడుదల చేసిన అంతర్జాతీయ బహుముఖ పేదరిక సూచీలో ఈ వివరాలు ఉన్నాయి.
ప్రపంచంలో అత్యధికంగా భారత్లోనే 23.4 కోట్ల మంది నిరుపేదలు ఉన్నారు. 9.3 కోట్ల మంది పేదలతో పాకిస్థాన్, 8.6 కోట్లమందితో ఇథియోపియా, 7.4 కోట్ల మందితో నైజీరియా, 6.6 కోట్లమందితో కాంగో పేదలు అధికంగా గల దేశాలుగా నిలుస్తున్నాయి. ప్రపంచ పేదలలో 48.1 శాతం మంది ఈ అయిదు దేశాల్లోనే నివసిస్తున్నారు.