భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరికాకు చెందిన యాక్సియమ్ స్పేస్, స్పేస్ ఎక్స్లు కలిసి 2025, మే నెలలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోకి పంపించే యాక్సియమ్ మిషన్-4(ఏఎక్స్-4)లో వ్యోమగాములతో పాటు భూమి మీద అత్యంత అరుదైన జీవి నీటి ఎలుగుబంటి (టార్డిగ్రేడ్) కూడా వెళ్లనుంది. యాక్సియమ్ మిషన్ను ప్రైవేట్ వ్యోమనౌక క్రూడ్రాగన్ జీ213 ద్వారా పంపించనున్నారు. మొత్తం 14-21 రోజుల పాటు ఐఎస్ఎస్లో ఉండే ఈ మిషన్లో నలుగురు వ్యోమగాములుంటారు. ఇందులో భారతీయ వైమానిక దళం టెస్ట్ పైలట్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా కూడా ఒకరు.