దేశంలోనే అత్యంత వేగంగా గంటకు 120 కి.మీ. వెళ్లే మెట్రోరైలును ఉత్తర్ప్రదేశ్లోని మేరఠ్లో 2026, ఫిబ్రవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. నమో భారత్ రైలునూ జెండా ఊపి ప్రారంభించారు. రూ.12,930 కోట్ల ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు.
దిల్లీ నుంచి మేరఠ్ మధ్య తిరగనున్న నమో భారత్ రైలు దేశంలోనే తొలి ‘ప్రాంతీయ శీఘ్ర రవాణా వ్యవస్థ’ (రీజనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్- ఆర్ఆర్టీఎస్) కిందికి వస్తుంది.