మహారాష్ట్రలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ (66) 2026, జనవరి 28న దుర్మరణం పాలయ్యారు. ఆయనతోపాటు మరో నలుగురు చనిపోయారు. బారామతి విమానాశ్రయం సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. వీఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేటు లిమిటెడ్కు చెందిన లీర్జెట్ 45 విమానం అజిత్ పవార్ను తీసుకుని ముంబయి నుంచి బయలుదేరింది. అది బారామతికి చేరుకున్నాక విమానం రన్వేపై దిగేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో కుప్పకూలి మంటల్లో చిక్కుకుంది.
1959, జులై 22న అజిత్ పవార్ జన్మించారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్పవార్ ఆయనకు బాబాయి. ఆరుసార్లు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి పదవిని చేపట్టి అజిత్ పవార్ రికార్డు సృష్టించారు.
అజిత్ పవార్ 2023 జులైలో తన చిన్నాన్న, ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్పై తిరుగుబాటు చేశారు. తదనంతర పరిణామాల్లో పార్టీ పేరు, ఎన్నికల చిహ్నం కూడా అజిత్ వశమయ్యాయి.