Published on Aug 29, 2025
Current Affairs
అజిత్‌కుమార్‌ మొహంతి
అజిత్‌కుమార్‌ మొహంతి

అణుశక్తి కమిషన్‌ ఛైర్మన్‌గా, అణుశక్తిశాఖ (డీఏఈ) కార్యదర్శిగా ప్రముఖ భౌతికశాస్త్రవేత్త అజిత్‌కుమార్‌ మొహంతి పదవీ కాలాన్ని మరో ఆరునెలల పాటు పొడిగించినట్టు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ తెలిపింది.

కేంద్ర మంత్రి మండలికి చెందిన నియామకాల కమిటీ ఈ పొడిగింపును ఆమోదించింది.

2025, సెప్టెంబరులో ఆయన పదవీ కాలం ముగియనుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.